కృష్ణ

అహంకారానికి రోజా పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా తెలుగు మహిళా ఆధ్వర్యంలో గురువారం బందర్‌రోడ్డులో రోజా దిష్టిబొమ్మన దగ్ధం చేశారు. జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ వైసిపి మహిళా ఎమ్మెల్యే రోజా ఇష్టానుసారంగా మాట్లాడుతూ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తానూ ఒక మహిళననే విషయాన్ని రోజా విస్మరిస్తున్నారని, వైఎస్‌ఆర్ లాగా చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు కాదు, ప్యాకేజీ రోజా అవాకులు, చవాకులను భయపడ్డారన్న విషయం గుర్తించుకోవాలని, 5 కోట్ల ప్యాకేజీల కోసం పార్టీ మారిన రోజాకు తమను ప్రశ్నించే అర్హతలేదన్నారు. నిన్నటి దాకా గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో కాల్‌మనీపై దాడులు జరుగుతున్నా కూడా చంద్రబాబు ప్రభుత్వం పైన అడ్డగోలు నిందలేసినందుకు జగన్మోహన్‌రెడ్డి అండ్ కో ముందు క్షమాపణలు చెప్పి తరువాత మాట్లాడాలన్నారు. ఇప్పుడు గౌతం సవాంగ్ తన పర్యటన, నెల ముందు దరఖాస్తు చేసుకున్న సెలవు రెండూ రద్దు చేసుకుని మళ్ళీ కాల్‌మనీ విచారణ కొనసాగిస్తుండడంపై జగన్ అండ్ కో ముక్కు నేలకు రాసి చంద్రబాబు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడానికి సిద్ధపడిందని తెలిపారు. కాల్‌మనీపై నగరంలో మాత్రమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాల్‌మనీపై దాడులు వద్దంటూ వైకాపా చేస్తున్న అడ్డగోలు వాదన ఇప్పటికీ కాల్‌మనీ దుండగులను కాపాడే విధంగా ఉండటం వారి అసలు వేషాన్ని బట్టబయలు చేస్తోందని, ప్రభుత్వం దృష్టికి కాల్‌మనీ వ్యవహారం వచ్చిన తక్షణమే దందాలు చేస్తున్న వాళ్లపై పోలీసు దాడులు, ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం, పీడించేవారిపైన నిర్భయ కేసుల నమోదు చేసి అరెస్టు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే, కాల్‌మనీ బాధితులకు అండగా నిలబడుతూ రుణాలు కట్టొద్దు మీకు అండగా నేనుంటానని స్వయంగా సిఎం చెప్పినా విమర్శలు చేయడం సరికాదని, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ దురుద్దేశ్యం కాదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి తలశిల స్వర్ణలత, కార్యదర్శి ఘంటా విజయదుర్గ, ఉపాధ్యక్షురాలు అన్నాబత్తుల శ్రీదేవి, మండవ లక్ష్మి, మధు శ్రీహరి రాణి పాల్గొన్నారు.