రంగారెడ్డి

విద్యార్థులకు నృత్య పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 19: తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో ఈనెల 21న స్థానిక పాఠశాలల విద్యార్థులకు నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బి.సునీతా సంపత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం చైర్ పర్సన్ తమ ఛాంబర్‌లో మున్సిపల్ కమీషనర్ బోగేశ్వర్లు, మేనేజర్ ఏ.రాములు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ విక్రం సింహారెడ్డిలతో కలిసి పాఠశాల విద్యార్థులకు నృత్యపోటీలు నిర్వహించే కార్యక్రమం పట్ల చర్చించారు. నృత్య పోటీలను మున్సిపల్ యంత్రాంగం తరఫున నిధులు కేటాయించటంతో పాటు, స్థానిక వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధుల సహకారంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ వెల్లడించారు. నృత్య పోటీలలో విజేతలయిన విద్యార్థులకు స్థానిక తులసి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ బహుమతులు ప్రదానం చేస్తారని, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్‌ను, చెవేళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ తూళ్ల దేవేందర్‌గౌడ్‌ను నృత్యపోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు చైర్‌పర్సన్ తెలిపారు.