రంగారెడ్డి

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, మార్చి 19: రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో రావడం ఖాయమాని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం.శివమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఎం.దీప్‌లాల్ చౌహాన్, మాజీ జడ్పీటీసీ యాచారం జంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఎం.ఏ.షుకూర్, మహేశ్వరం గ్రామశాఖ అధ్యక్షుడు ఎం.బాల్‌రాజ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌లో సబితారెడ్డి సమక్షంలో చేరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయక నిరుద్యోగులు, రైతులు, దళితులను మభ్యపెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ పీ.స్నేహ సురేష్, వైస్ ఎంపీపీ ఎం.స్వప్ననవీన్, నవీన్, ఎం.శివమూర్తి, కే.రాఘుమా రెడ్డి, ఎస్.శ్రీశైలం, కే.నర్సింహా రెడ్డి, రాయప్ప, జీ.నర్సిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.