రంగారెడ్డి

జనరల్ స్టోర్లపై ఎస్‌ఓటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 1: సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు మంగళవారం ఉప్పల్ అన్నపూర్ణ కాలనీలోని కిరాణ జనరల్ స్టోర్లపై దాడులు చేసి రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు.
పేదలకు చేరాల్సిన సబ్సిడీ బియ్యం, గోధుమలు, కందిపప్పు, కిరోసిన్ తదితర వస్తువులను డీలర్లు కిరాణ, జనరల్ స్టోర్లకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్‌ఓటి పోలీసులు సోమవారం కిరాణం స్టోర్లపై దాడిచేసి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రెండవ రోజు కిరాణ స్టోర్లపై దాడులు చేసి పలువురిపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
రేషన్ షాపుల తనిఖీ
ఇదిలా ఉండగా ఎస్‌ఓటి పోలీసులు కిరాణం జనరల్ స్టోర్లపై దాడులు చేసి నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో సివిల్ సప్లయిస్ ఉప్పల్ సర్కిల్ అధికారులు మంగళవారం రేషన్ షాపులను తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం సరుకులు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి పంపిణీ చేశారో పూర్తి వివరాలను సేకరించారు. అధికారుల నిర్లక్ష్యంతో డీలర్ల ఇష్టారాజ్యంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు చేరాల్సిన సబ్సిడీ సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌ఓటి పోలీసుల దాడులే నిదర్శమని చెప్పవచ్చు.