రంగారెడ్డి

ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 25: ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో నియోజకవర్గంలోని ఉద్యానవనాల అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేక్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లలోని ఉద్యానవనాలు ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రజలకు ఉద్యానవనాలు అందిస్తాయని చెప్పారు. పార్కులను అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. రాఘవ ఎస్టేట్స్, అపురూపకాలనీలలో ఉద్యానవనాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, మేనేజర్ పద్మారావు, సూపర్‌వైజర్ కిరణ్ పాల్గొన్నారు.
మా భగవతీ జాగరణ ఏర్పాట్ల పరిశీలన
సూరారం డివిజన్ షాపూర్‌నగర్‌లో ఈ నెల 26న జరగబోయే మా భగవతి 10వ జాగరణ వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే కేపీ వివేక్ పరిశీలించారు. వివేక్ మాట్లాడుతూ ధార్మిక యువ సమితి ఆధ్వర్యంలో మా భగవతి జాగరణ వేడుకలను నిర్వహిస్తున్నారని, ఈ వేడుకలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేటర్‌లు సత్యనారాయణ, జగన్, సీఐ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.