రంగారెడ్డి

ఆస్తి కోసం మేనకోడలిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, మే 23: ఆస్తిపై కనే్నసిన ఓ కసాయి పథకం ప్రకారం మేనకోడలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ఆస్తి కాజేయాలని వేసిన పథకం కాస్త..బెడిసి కొట్టడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కెపిహెచ్‌బి ఇనె్స్పక్టర్ కుషల్కర్ తెలిపిన వివరాలిలావున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన అజయ్ షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా అజయ్‌కు కొద్ది రోజుల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. తుల్లూరు ప్రాంతానికి చెందిన అక్క బావలు కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో అజయ్‌తో పాటు పక్క పక్క ఇళ్లలో నివాసముంటున్నారు. అజయ్ తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అక్కాబావల వద్దే పెరిగాడు. కాగా వారి కూతురు(24) సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా హైటెక్‌సిటీలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవల ఆమె పేరుపై సుమారు రూ.4కోట్ల నుంచి 5 కోట్ల మేర ఆస్తి తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే క్రమంలో తన మేనకోడలు మరో వ్యక్తితో ఇటీవల చనువుగా ఉండడాన్ని గమనించాడు. ఆమె పేరుపై ఉన్న ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలనే ప్లాన్ వేశాడు. ఈనెల 20న అక్కాబావ ఊరెళ్లారు. ఇదే అదునుగా భావించి ఆమెపై అత్యాచారానికి పూనుకోగా వద్దంటూ గంట వరకు బ్రతిమిలాడింది. చివరకు అజయ్‌కు ఆస్తీలో వాటా కూడా ఇస్తానని హామీ ఇచ్చింది. అయినప్పటికీ కనికరించకుండా కత్తితో భయపెట్టి అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా నగ్నంగా ఉన్న ఫొటోలు కూడా చిత్రీకరించాడు. ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరించాడు. సంఘటన అనంతరం అజయ్ పరారీ కాగా బాధితురాలు అదే రోజు నేరుగా కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజయ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.