రంగారెడ్డి

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మార్చి 20: చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండ ఎగురవేద్దామని పీసీసీ కార్యదర్శి ఎల్గంటీ మధసూదన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని మన్‌మర్రి, బొడంపహాడ్, చర్లగూడ, ఆస్పలిగూడ, ఎల్గోండగూడ తదితర గ్రామాలను పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 23న నాగర్‌గూడలోని పీఎస్‌అర్ గార్డెన్‌లో చేవెళ్ల ఎంపీ కొండ విశే్వశ్వర్‌రెడ్డి అధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, అభివృద్ధి చేసేది కాంగ్రెస్‌కే సాధ్యం అవుతుందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎంపీ కొండ విశే్వశ్వర్ రెడ్డిని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పీసరి సురేందర్ రెడ్డి, రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, అంజనేయులు గౌడ్, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాలి
* గౌడవెళ్లిలో అవగాహనకు కవాతు
మేడ్చల్, మార్చి 20: ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ కోరారు. బుధవారం మండలంలోని గౌడవెళ్లి గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పోలీసులు గ్రామంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందు వారిలో ధైర్యాన్ని నింపేందుకు పోలీసుల కవాతు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఓటు యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కవాతు నిర్వహించినట్లు వివరించారు. స్థానిక సర్పంచ్ సురేందర్ పాల్గొన్నారు.