రంగారెడ్డి

మల్‌రెడ్డిపల్లిలో దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 5: పట్టణ పరిధిలోని మల్‌రెడ్డిపల్లి చెరువు కట్టపై కట్టమైసమ్మ గుడి వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్‌రెడ్డిపల్లికి చెందిన అడికె సాయప్ప(55) వాచ్‌మెన్. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం పనిచేసే తాండూరు మండలం అంతారం తండాలోని భూకైలాస్ దేవస్థానానికి కాపలాకు బయలుదేరాడు. దేవస్థానానికి కట్టమైసమ్మ చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా పదునైన కత్తులతో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. చాతి, కడుపు, ఇతర భాగాలపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని కట్టమైసమ్మ గుడిలోకి చేర్చి అమ్మవారి గోడకు నిలిపి దుండగులు పారిపోయారు. సంఘటనతో కలకలం ఏర్పడింది. ఎఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో పట్టణ సిఐ వెంకటరామయ్య, ఎస్‌ఐలు నాగార్జున, ఎండి షరీఫ్ దర్యాప్తు చేస్తున్నారు. సాయప్ప హత్యకు మల్‌రెడ్డిపల్లికి చెందిన పటోళ్ల గోవర్దన్‌రెడ్డి కుటుంబీకులే కారకులనే అనుమానాలు ఉన్నాయి. 2012లో గోవర్దన్‌రెడ్డి సోదరుడు పరశురాంరెడ్డి హత్యకు గురయ్యాడు. పరశురాంరెడ్డి హత్య కేసులో సాయప్ప, అతని భార్య గుండమ్మ, కుమారుడు రమేశ్, నర్సింలు, కూతురు బాలమణి నిందితులుగా జైలుకు వెళ్లివచ్చారు. పాత కక్షలతో హత్య జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సిఐ వెంకటరామయ్య పేర్కొన్నారు.