రంగారెడ్డి
ఆరోగ్యంతోనే అభివృద్ధి సాధ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 June 2019
కులకచర్ల, జూన్ 19: ఆరోగ్యంగా ఉంటే అభివృద్ది సాధ్యమైతుందని, కులకచర్లని బహిరంగ రహిత మలవిసర్జన గ్రామంగా ఈనెల 25లోపు మార్చాలని కలెక్టర్ అయోషా మస్రత్ ఖానూమ్ సూచించారు. బుధవారం కులకచర్ల పర్యటనకు వచ్చిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మూడు గ్రామాలను వృథావనరుల వినియోగం కింద ఎంపిక చేశారని దాంట్లో కులకచర్ల ఒకటని అన్నారు. అనంతరం మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అందరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ జాన్సన్, సర్పంచ్ పట్లోళ్ల సౌమ్య పాల్గొన్నారు.