రంగారెడ్డి

పీర్జాదిగూడలో రోడ్డు కబ్జా తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 23: పీర్జాదిగూడ బుద్ధానగర్‌లోని రోడ్డు నెంబర్ 11లో రోడ్డు కబ్జా చేసి నిర్మించిన అక్రమ షెడ్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు మద్ది యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు చేపట్టిన ఆందోళనపై మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ వాణీ రెడ్డి ఆధ్వర్యంలో టీపీఎస్ అశోక్ సర్వే చేసి లేఔట్ ప్రకారంలో మంగళవారం రోడ్డు కబ్జాను తొలగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపి సంబురాలు జరుపుకున్నారు.
శిథిలావస్థకు చేరిన కట్టడాల కూల్చివేత
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో శిథిలావస్థకు చేరిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన కట్టడాలను ఉపేక్షించేది లేదన్నారు. వర్షాకాలంలో కూలిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఇలాంటి భవనాలను సర్కిల్ పరిధిలో గుర్తిస్తున్నట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో మంగళవారం లక్ష్మిగూడ, బుద్వేల్, హైదర్‌గూడలలో ఉన్న సుమారు ఆరు నిర్మాణాలను కూల్చివేశామని పేర్కొన్నారు.