రంగారెడ్డి

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఆగస్టు 21: ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్‌ఎస్ యూత్ నాయకులు జైహింద్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలను చేపట్టిన జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం తాము ఎల్లప్పుడు కృషి చేస్తామని, ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్ గౌడ్, పాపిరెడ్డి, మహమూద్, పాపులు, మల్లారెడ్డి పాల్గొన్నారు.

గ్రంథాలయం భవనం కోసం స్థలం కేటాయించాలి
ఉప్పల్, ఆగస్టు 21: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్‌లో గ్రంధాలయం భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ వాణీ రెడ్డికి మాజీ ఎంపీటీసీ వికే నాదంగౌడ్ బుధవారం వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అనంతరం నగరపాలక సంస్థగా ఏర్పడిన పీర్జాదిగూడలో గ్రంధాలయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.