రంగారెడ్డి

జైట్లీ సేవలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 25: దేశానికి కేంద్ర మంత్రిగా అరుణ్‌జైట్లీ సేవలు చిరస్మరణీయమని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అడికె జనార్దన్ అన్నారు. అరుణ్‌జైట్లీ మృతికి సంతాపంగా ఆదివారం అడికె జనార్దన్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ అడుగు జాడల్లో నడిచి ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లొచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి ప్రతాప్ రెడ్డి, అడికె రాజు, బీఎన్ నర్సింహ్మా, రాజు, నవారు మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సీఎం వెంకటరమణ గుప్త, గొరిగె శివ, కృష్ణ, దినేష్, సంజయ్ పాల్గొన్నారు.
27న నారుూ బ్రాహ్మణ వార్షికోత్సవ మహాసభ
రాజేంద్రనగర్, ఆగస్టు 25: 27వ తేదీన తెలంగాణ నారుూ బ్రాహ్మణ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర కార్యవర్గం సభ్యులు తెలిపారు. ఆదివారం ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ఈ వార్షికోత్సవ మహోత్సవాన్ని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ మెయిన్ రోడ్‌లో పిల్లర్ నెంబర్ 148వద్ద ఎస్‌ఎంగార్డెన్ ఫంక్షన్‌హాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అబ్కారి, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ ఎస్.రాములు, బీసీ కమిషన్ సీనియర్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు సీ.కా ళప్ప, బేగంపేట్ కార్పొరేటర్ ఎం.తరుణినాయి పాల్గొంటారని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నారుూ తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌నెంబర్లు 9848454591, 9346041483లలో సంప్రదించాలని వెల్లడించారు.