రంగారెడ్డి

దసరా మేళా ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, అక్టోబర్ 20: ఎల్బీనగర్ సర్కిల్ పద్మాశాలి సంఘం దసరా మేళా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆటోనగర్ హరిణ వనస్థలి అనన్య ఏకోటూరిజం పార్కులో ఏర్పాటు చేసిన మేళాకు ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని పద్మశాలి కులస్థులు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో హాజరై బంధుమిత్రులతో ఆత్మీయంగా గడిపారు. కొత్తపేట హోమ్ని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహిళలకు, చిన్నపిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. పద్మాశాలి మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. వధూవరులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మేళాకి ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్, మహిళా ఆర్థిక సాధికారిత సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హాజరయ్యారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం దసరా మేళా కమిటీ చైర్మన్ పున్న గణేష్ నేత, సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షుడు పులుగం రాములు నేత, ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ నేత, కోశాధికారి జెల్లా సూర్యకాంత్ నేత, సంఘం రాష్ట్ర నాయకులు రాపోలు సుధాకర్ నేత, మాజీ కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్, రావిరాల సంధ్యారాణి, వర్ణలీల, భారతమ్మ, గర్ధాస్ చంద్రకళ, జెల్లా జగన్నాథం, టీ.రమేష్ నేత, వడ్డెపల్లి నాగేశ్వర్‌రావు, ఎస్.శ్రీనివాస్ నేత, ఆంజనేయులు నేత, బొమ్మ రఘురాం నేత, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.