హైదరాబాద్

నాగారంలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, అక్టోబర్ 29: గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులకొట్టి ఇంట్లో ఉన్న 15 తులాల బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన సంఘటన నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. సిఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగారం గ్రామం, ఎస్‌వి నగర్‌లో నివాసముంటున్న యుఎస్. గురురాజా పాడిత్యాయ రెండురోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి స్వగ్రామమైన కర్నాటకలోని ఉడిపికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
ఇది గమనించిన దుండగులు గ్రిల్ తొలగించి ఇంట్లో చొరబడ్డారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న 15 తులాల బంగారం, కిలోవెండి ఆభరణాలను దోచుకెళ్లారు. శనివారం ఉదయం కిటికి గ్రిల్ తొలగించి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సిఐ గురువారెడ్డి, డిసిపి రమేశ్‌నాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఉడిపిలో ఉన్న గురురాజాతో ఫోన్‌లో డిసిపి రమేశ్‌నాయుడు మాట్లాడి బీరువాలో ఉన్న ఆభరణాల వివరాలు అడిగి తెలుకున్నారు. క్లూస్‌టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.