రంగారెడ్డి

సామాన్యులతో కలిసి మంత్రి పద్మారావు ‘చాయ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 11: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 143 వద్ద గల గోల్డెన్ ప్యాలెస్ హోటల్‌లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ కస్టమర్లతో కలిసి ‘టీ’ ఆస్వాదించారు. సాయంత్రం సమయంలో అటుగా వెళ్తూ గోల్డెన్ ప్యాలెస్ హోటల్‌ను సందర్శించారు. అక్కడే ఉన్న సామాన్య కస్టమర్లతో కలిసి చాయ్‌ను తాగారు. హోటల్ యజమాని యోగేష్ సింగ్ మంత్రి పద్మారావును ఆహ్వానించారు. మంత్రి కస్టమర్లతో, హోటల్ యజమానులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగరంలోని అత్తాపూర్ గోల్డెన్ ప్యాలెస్ హోటల్ ప్రజలకు మంచి సేవలందిస్తుందని కితాబిచ్చారు. హోటల్‌లో టీ చాలా బాగా ఉందని ఆయన హోటల్ యాజమాన్యాన్ని అభినందించారు. హోటల్‌లోని కస్టమర్లు, యజమానులు మంత్రి పద్మారావుతో కలిసి సెల్ఫీలను దిగారు. మంత్రి కస్టమర్లు, యజమానులు అవాక్కయ్యారు.