రంగారెడ్డి

ప్రేమ పేరుతో వేధిస్తున్న విద్యార్థిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 26: ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని వేధిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బొత్తుపల్లి రాజేందర్(21) మండలంలోని కిష్ఠాపూర్ గ్రామంలో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (విఎంఆర్) బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ పట్టణంలోని ఓ వసతిగృహంలో ఉంటున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా పట్టణానికి చెందిన ఓ 16 సంవత్సరాల అమ్మాయిని ప్రేమ పేరుతో నిత్యం వెంటపడుతూ వేధించసాగాడు. అతని వేధింపులు శృతి మించడంతో అమ్మాయి ఈ విషయాన్ని తల్లితండ్రులకు తెలిపింది. ఈ మేరకు అమ్మాయి తండ్రి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.