రంగారెడ్డి

ఎయర్‌పోర్టులో బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, జూన్ 26: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 847 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయి నుంచి ఓ ప్రయాణికుడు 847 గ్రాముల బంగారాన్ని తీసుకొని ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అతని బ్యాగ్‌లో బిస్కెట్ల రూపంలో 847 గ్రాముల బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం బంగారంతోపాటు అతనిని నగరంలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియరాలేదని త్వరలోనే మీడియాకు వివరిస్తామని తెలిపారు.