రంగారెడ్డి

ఆడుకుంటూ వెళ్లి సంప్‌లో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూన్ 28: ఇద్దరు అన్నదమ్ముళ్లు ఇంటి వద్ద ఆడుకుంటుండగా సంప్‌లో పడి తమ్ముడు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ధనుంజయ్య కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుభాన్ భార్య రాధాతో బతుకుదేరువు కోసం నగరానికి వచ్చి రాజేంద్రనగర్ మండలంలోని పూప్పాలగూడ ఎల్‌ఐసీ కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు మాదిరిగానే మంగళవారం కూడా సుభాన్ రాధాల దంపతుల ఇద్దరు పిల్లలను ఇంటి వద్దనే ఉంచి కూలీ పనుల కోసం వెళ్లారు. ఈక్రమంలో సన్‌దీప్(5)తోపాటు అన్నా ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఇంటికి సమీపంలోని ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో సంపు ఉంది. ఆడుకుంటూ సందీప్ అందులో పడిపోయాడు. వెంటనే గ్రహించిన సందీప్ అన్న స్థానికంగా ఉన్న గ్రామపంచాయతి కార్యాలయంలో తన తమ్ముడు సంప్‌లో పడిపోయ్యాడని తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు సంప్ వద్దకు వెళ్లి చూడగా నీటిలో మునిగి సందీప్ మృతిచెంది ఉన్నాడు. స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన బాలుడిని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.