రంగారెడ్డి

కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జూలై 3: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలోని లబ్దిదారులకు అందేలా కృషి చేస్తూ 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో బిజెపిని బలమైన శక్తిగా తయారు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రేమ్‌రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహేశ్వరం మండల కేంద్రంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాలులో మండల బిజెపి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందేలా బిజెపి కార్యకర్తలు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలు ఆరిపోయే దీపాలని, ఇస్లామిన్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న మజ్లిస్‌తో దోస్తీ కొనసాగిస్తున్న టిఆర్‌ఎస్‌కు 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని, ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి అవతరిస్తుందని తెలిపారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డిపై దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు వి.సుధాకర్‌శర్మ, బి.పాపయ్య గౌడ్, కె.అనంతయ్యగౌడ్, ఎస్.మాధావాచారి పాల్గొన్నారు.