రంగారెడ్డి

తిన్న బొమికలు కడిగించి కుక్కలకు పెట్టిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 10: హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న సంఘటనలో రంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్‌ను విధుల నుండి తప్పించి విచారణ చేపట్టాలని హోంగార్డుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.శుభప్రద్‌పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహం ఆవరణలో జిల్లా హోంగార్డులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హోంగార్డుల చేత నీచాతినీచమైన పనులు చేయించడం విచిత్రకరమని చెప్పారు. మాంసాహారం తిన్న తర్వాత మిగిలిన బొక్కలను శుభ్రంగా కడిగించి కుక్కలకు పెట్టిస్తున్నారని, ఇంతకంటే అమానుషం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇది హోంగార్డులకు నరకం చూపినట్టేనని వాపోయారు. ఉదయం నుండి అర్థరాత్రి వరకు పని చేయించుకుని ఇక్కట్లపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఇన్‌ర్జి డిజిపి విచారణకు డిఐజి అకున్‌సబర్వాల్‌ను ఆదేశించారని, విచారణ పేరుతో జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు నలుగురు హోంగార్డులను శనివారం రాత్రి నిర్బంధించి తప్పుడు సాక్ష్యంతో ఎస్‌బిఐ సంతకాలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సంఘటనపై డిఐజి పూర్తి విచారణ చేపట్టాలి తప్ప ఎస్పీ ఆదేశం మేరకు ఎస్‌బిఐ చేపట్టరాదని డిమాండ్ చేశారు. ఓ పక్క ముఖ్యమంత్రి కేసిఆర్ హోంగార్డు వ్యవస్థను ప్రక్షాళన చేసి వేతనాలు పెంచి మేలు చేయాలనే ఆలోనచలో ఉండగా అధికారులు వెట్టి చేయించుకోవడమేమిటని ప్రశ్నించారు. సంఘటన విషయమై హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్ళామని, అమెరికా నుండి రాగానే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళతామని వివరించారు.
బండచాకిరీ చేయించిన ఎస్పీని విధుల నుండి తొలగించాలి
మీడియా ఎదుట గోడు వెళ్ళగక్కిన హోంగార్డులు
తమ చేత బండచాకిరీ చేయించిన ఎస్పీని విధుల నుండి తొలగించాలని పలువురు హోంగార్డులు డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో క్యాంపు కార్యాలయం, జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద పనిచేసిన హోంగార్డులు మీడియా ఎదుట గోడును వినిపించారు. క్యాంపు కార్యాలయం వద్ద గేదెను శుభ్రం చేయడం మొదలు, వివిధ ప్రాంతాల నుండి గడ్డి తెచ్చి మేత పెట్టడం, మైదానం ఊడ్చడం చేయించేవాడని చెప్పారు. భోజనం తర్వాత పాత్రలు కడిగించే వారని, మిగిలిన బొక్కలను శుభ్రంగా కడిగించి కుక్కలకు పెట్టించే వారని పేర్కొన్నారు. ఎస్పీతో పాటు కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేయాలని, అలా చేయకపోతే బెదిరించేవారని, వివిధ పోలీస్‌స్టేషన్‌లు, డిటిసిలో పనిచేసే హోంగార్డులను సైతం క్యాంపు కార్యాలయానికి బదిలీ చేసి చాకిరీ చేయించారని అన్నారు. ఒక హోంగార్డు మృతిచెందితే అంత్యక్రియలకు వెళ్ళేందుకు కనీసం వాహనం ఇవ్వలేదని వాపోయారు. ఇవన్నీ చాలవన్నట్టుగా శని, ఆదివారాలు నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఎస్పీ కుటుంబం గడిపే ఇంటిలోనూ పనిచేయించారని వివరించారు. ఇక్కడ నుండి హోంగార్డులు అక్కడకు వెళ్ళి పనిచేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటిలో అరవింద్ అనే వ్యక్తి చెప్పినట్టు వినాలని లేకపోతే బెదిరింపులకు పాల్పడే వారని అన్నారు. ఎస్పీ నవీన్‌కుమార్, ఎస్‌బిఐ వేణుగోపాలరాజులు ఎలాంటి సంబంధం లేని ఎఎస్పీ వెంకటస్వామిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విచారణ పేర హోంగార్డులను బంధించి బెదిరించి తప్పుడు సంతకాలతో సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసి న్యాయం చేయాలని, లేనిఎడల దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. జిల్లాలోని 285 మంది హోంగార్డులలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా బాధ్యత ఎస్పీ నవీన్‌కుమార్, ఎస్‌బిఐ వేణుగోపాలరాజుదేనని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా హోంగార్డుల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, ప్రధానకార్యదర్శి శ్రీశైలం, నాయకులు ఆంజనేయులు, రజియొద్దీన్, బందయ్య పాల్గొన్నారు.