రంగారెడ్డి
ఆర్కెపురం చెరువులో దూకి ఇద్దరు యువతుల ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేరేడ్మెట్, ఆగస్టు 5: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు యువతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ జగదీష్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్మెట్ పరిధిలోని రామకృష్ణపురం చెరువులో గుర్తుతెలియని రెండు మృతదేహాలు ఉన్నాయని స్థానికులు నేరేడ్మెట్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తిశారు. అక్కడ దొరికిన సూసైడ్నోట్ ఆధారంగా ఆత్మహత్య చేసుకున్న యువతులు వౌనిక నాగర్జున(20), సౌమ్య రాజేశ్వర్(22) లుగా గుర్తించారు. సూసైడ్నోట్లో తాము ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసారని సిఐ పేర్కొన్నారు. మృతులు ఎక్కడివారో ఇంకా తెలియదని ఆచూకీ తెలిసిన వారు నేరేడ్మెట్ సిఐని సంప్రదించాలని కోరారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.