రంగారెడ్డి

హత్య కేసులో ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 26: మద్యంలో కలుపుకోవడానికి నీటి ప్యాకెట్లు తీసుకురాలేదనే అక్కసుతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను మియాపూర్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కొత్వాల్ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లా మొంగ గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (20), న్యూహఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్‌లో నివసిస్తున్న సయ్యద్ షఫీ (23) స్థానికంగా ఉన్న ఓ బేకరీలో పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం మార్తాండనగర్ పక్కనగల ఎవి ఎస్టేట్‌లోని నీటి ట్యాంక్ వద్ద మద్యం తాగడానికి ఇస్మాయిల్, షఫీ వెళ్లారు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తిని మందులో కలుపుకోవడానికి నీటి ప్యాకెట్లు తీసుకురావాలని బెదిరించారు. అతను ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లి పట్టుకుని ఘర్షణకు దిగారు. తాగిన మైకంలో ఆగ్రహావేశాలకు గురైన ఆ యువకులు అతన్ని బండరాయితో తలపై గుర్తు పట్టకుండా కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని ఇన్‌స్పెక్టర్ రమేష్ కొత్వాల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. కాగా సంఘటనా స్థలంలో లభ్యమైన వస్తువుల ఆధారంగా సమీపంలోని వైన్ షాపువద్ద నుంచి సిసి ఫుటేజీ తీసుకుని పరిశీలించి వీరిని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. హత్యకు గురైన వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.