హైదరాబాద్

మూడవ రోజుకు చేరిన రిలే దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, సెప్టెంబర్ 8: షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లా లో చేర్చేంతవరకు ఉద్యమం చేస్తామని మండల అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. మూడోరోజుకు చేరిన దీక్షల శిబిరాన్ని గురువారం సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్‌మల్లేష్, టిఅర్‌ఎస్ రాష్ట నాయకులు చల్ల మాధవ్‌రెడ్డి, జిల్లా నాయకులు మధుసూసుదన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పిసరి సురేందర్‌రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, షాబాద్ ఎంపిపి జ్యోతిరవికుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్‌మల్లేష్ మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాను మూడుముక్కలు చేసి ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఅర్‌ఎస్ సర్పంచులు, కాంగ్రెస్ సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసి, ఎంపిపి, మండల అఖిలపక్ష నాయకులు రవీందర్‌రెడ్డి, జంగయ్య, శ్రీకాంత్‌రెడ్డి, రాము, రాపోల్ నర్సింలు, కృష్ణ, మండలంలోని వివిధ పార్టీ నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.