రంగారెడ్డి

ప్రశాంతంగా కానిస్టేబుల్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఏప్రిల్ 24 : చేవెళ్లలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. చేవెళ్ల మండలంలోని బండారి శ్రీనివాస్, సాగర్, రాయల్, ఫరా, అల్‌హబీబ్ మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఐదు సెంటర్లలో 4497 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 3952 మంది పరీక్షలకు హాజరుకాగా 545 మంది గైర్హాజరయ్యారు. బండారా శ్రీనివాస్ సాగర్ , ఫరా, రాయల్, అల్‌హబీబ్ కళాశాలలో మొత్తం 4497 మంది పరీక్షలు రాసినట్టు సిఐ ఉపేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష సెంటర్ల వద్ద నలుగురు సిఐలు, ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పరీక్ష సెంటర్ల వద్ద మంచి నీరు లేకపోవడంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్ష సెంటర్ల వద్దకు గెజిటెడ్ సంతకం లేకుండా వచ్చిన వారిని, ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో వారు బోరున విలపిస్తూ వెనుతిరిగారు.