రంగారెడ్డి

రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో రజకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రజక దోభీ అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యదర్శి జుపల్లి నర్సింగ్‌రావు తెలిపారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో రజక సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని 18రాష్ట్రాల్లో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని అన్నారు. తెలంగాణలోని రజకులందరినీ ప్రభుత్వం ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రానికికి నివేదిక అందించేందుకు సిఎం కేసిఆర్‌ను కలువనున్నామని పేర్కొన్నారు. రజక సంఘం నూతన కమిటీల నియమకం కోసం ఈనెల 18న హైదారాబాద్ నగరంలోని బిసి భవన్‌లో మధ్యాహ్నం 1గంటకు అన్ని జిల్లాల రజక సంఘం నాయకులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో రజక సంఘం జిల్లా మాజీ డైరైక్టర్ దేవు శర్వలింగం, రాజేంద్రనగర్ ఇన్‌చార్జి కృష్ణ, చేవెళ్ల ఇన్‌చార్జి కృష్ణ, మణికొండ ఉపాధ్యక్షుడు రమేష్, నర్సింగ్, సలహదారుడు కుమార్, నాయకులు రాజేష్, మధు, రాకేష్ ఉన్నారు.