రంగారెడ్డి

కారును ఢీకొట్టిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, డిసెంబర్ 4: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని గోప్లాపూర్ క్రాస్‌రోడ్డు దగ్గర ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలుకాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్ణాటకలోని సింధనూర్‌కు వెళ్తున్న కారును రాయిచూర్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీకి చెందిన నాగేందర్ ధనలక్ష్మి, శిల్ప, వీరభద్రయ్య, సలీంలు తీవ్రగాయాల బారిన పడ్డారు. కర్ణాటకలోని సింధనూర్‌కు బయలుదేరుతుండంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని పెద్దగోప్లార్ క్రాస్‌రోడ్డు దగ్గర ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయాల పాలయ్యారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్తపుమడుగులో కొట్టమిట్టాడుతున్న క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఎస్‌విఎస్ ఆసుప్రతికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు దేవరకద్ర ఎస్సై వినయ్‌రెడ్డి తెలిపారు.

రెండు ఆటోలు ఢీ
* ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
వికారాబాద్, డిసెంబర్ 4: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన ధారూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే సర్పన్‌పల్లి గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మోమిన్‌కుర్దు గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.