తెలంగాణ
ఆర్టీసీ కార్మికులు అధైర్య పడవద్దు:అశ్వత్థామరెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులెవ్వరు అధైర్య పడవద్దని జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్పై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఏ ఒక్క డిమాండ్ను వెనక్కి తీసుకోబోమని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయటానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయం సేకరించాలని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద రేపు చేపట్టే ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.