తెలంగాణ

ఆర్టీసీ కార్మికులతో సీఎం చర్చలు జరపాలి:్భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత 40 రోజులకు పైగా 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ హైకోర్టు చేసిన సూచనలు పక్కనపెట్టి నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. స్వచ్ఛగా తమ భావాలను వ్యక్తంచేసే తెలంగాణ సమాజం కేసీఆర్ చేతిలో నలిగిపోతుందని అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని హైకోర్టు పలుమార్లు సూచించిందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలేనని, తెలంగాణ రాష్ట్ర సాథనలో వారు భాగస్వాములయ్యారని అన్నారు.