తెలంగాణ

కెసిఆర్ విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండ ల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విగ్రహాన్ని తెరాస మండల అధికార ప్రతినిధి గుండా రవీందర్ కెసిఆర్ జన్మదిన సందర్భంగా బుధవారం తన ఇంటి వద్ద ఆవిష్కరించారు. తెరాసకు వీరాభిమాని అయిన రవీందర్ గతంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి విగ్రహాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిపై తనకు ఉన్న అభిమానంతో తన ఇంటి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశానని రవీందర్ వివరించారు. కాగా ముఖ్యమంత్రి విగ్రహావిష్కరణకు పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావులు హాజరై విగ్రహావిష్కరణ జరుపుతారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఎలాంటి తల నొప్పులు ఎదురవుతాయోనని చివరి నిమిషంలో ప్రజా ప్రతినిధులు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో గుండా రవీందర్ దంపతులు ఆగ్రహిస్తూ తాము కెసిఆర్‌పై అభిమానంతో విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడితే ప్రజాప్రతినిధులు రాకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.