జాతీయ వార్తలు

స్టేషన్ ఘన్‌పూర్-సూర్యాపేట రైల్వే లైనుకు అదనపు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: తెలంగాణకు సంబంధించిన పలు పథకాలను రానున్న రైల్వే బడ్జెట్‌లో చేర్చాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఆనంద్ భాస్కర్ గురువారం సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. స్టేషన్ ఘనపుర్-సూర్యాపేట్ రైల్వే లైను నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలన్నారు. జనగామ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఆనంద్ భాస్కర్ రైల్వే మంత్రిని కోరారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఇకనైనా చేపట్టాలని ఆయన కోరారు. కాజీపేట్ జంక్షన్ ప్రాధాన్యత ఎంతో పెరిగిపోయిందని, పెరిగిన అవసరాల మేరకు దీనిని ఆధునీకరించవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన సూచించారు.