క్రీడాభూమి
మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ .. భారత్ చేతిలో థాయిలాండ్ చిత్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 February 2017
కొలంబో, ఫిబ్రవరి 8: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్షిప్ క్వాలిఫయర్స్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో థాయిలాండ్ చిత్తుచిత్తుగా ఓడింది. భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్కు దిగిన థాయిలాండ్ 29.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 12.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి విజయం సాధించింది. తిరుష్ కామినీ 24, వేదా కృష్ణమూర్తి 17 పరుగులతో నాటౌట్గా నిలిచారు. మొదటి మ్యాచ్లో శ్రీలంకను 114 పరుగుల తేడాతో ఓడించిన భారత్కు ఇది వరుసగా రెండో విజయం.