రాష్ట్రీయం

నేటి నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 16: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతినొందిన యాదాద్రిభువనగిరి జిల్లా యాదా ద్రి(యాదగిరిగుట్ట) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 17 నుండి 27వరకు 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్నా యి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తుల రద్దీ అంచనాల మేరకు అవసరమైన ఏర్పాట్లను యాదాద్రి దేవస్థానం చేపట్టింది. ఆలయ పునర్ నిర్మాణ పనులు సాగుతున్న నేపధ్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సూచనల మేరకు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన లక్ష్మీనరసింహుల తిరు కల్యాణోత్సవంతో పాటు విశేషాలంకార, వాహన సేవలన్నీ కూడా బాల ఆలయంలో నిర్వహించనున్నారు. 24వ తేదీ శనివారం బాల ఆలయంలో ఉదయం 11గంటలకు నిర్వహించే లక్ష్మినరసింహుల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆనవాయితీగా సీఎం కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు వైభవోత్సవ కల్యాణాన్ని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో భక్తుల సమక్షంలో నిర్వహించనుండగా గవర్నర్ ఎల్.నరసింహన్ దంపతులు కల్యాణోత్సవానికి హాజరుకానున్నారు. స్వామివారి దివ్య విమాన రథోత్సవాన్ని సైతం కొండ కిందనే నిర్వహిస్తారు. ఇతర బ్రహ్మోత్సవ పూజాధికాలు, అలంకార సేవలు, వాహనసేవలు అన్ని బాల ఆలయంలోపలే నిర్వహించనున్నారు. సాంస్కృతిక, ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలన్ని కొండపైనే యథాతథంగా కొనసాగనున్నాయి. 23న జరిగే ఎదుర్కోలు ఘట్టానికి జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
11రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ఉదయం ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివచనంతో ప్రారంభమవుతాయి. 18న ఉదయం 11గంటలకు ధ్వజారోహణం, రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం, 19న ఉదయం 11గంటలకు మత్య్సావతార అలంకార సేవ, వేద పారాయణాల ప్రారంభం, రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు. 20న ఉదయం 11గంటలకు శ్రీ మురళీకృష్ణాలంకారం, రాత్రి 8:30 గంటలకు హంసవాహన సేవ, 21న ఉదయం 11గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి పొన్నా వాహన సేవ, 22న ఉదయం గోవర్ధన గిరిధారి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవ, 23న ఉదయం 11గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 11గంటలకు అశ్వవాహన సేవ, బాల ఆలయంలో శ్రీ స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 24వ తేదీ శనివారం ఉదయం 10గంటలకు శ్రీరామ అలంకారసేవ, హనుమంత వాహనసేవ, ఉదయం 11గంటలకు బాల ఆలయంలో శ్రీ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, రాత్రి 8గంటలకు కొండ కింద జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామి వారి వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. 25న ఉదయం 11గంటలకు స్వామివారికి మహావిష్ణు అలంకార సేవ, గరుడ వాహన సేవ, రాత్రి 7గంటలకు కొండ కింద విమాన రథోత్సం, 26న ఉదయం 10:30కు మహాపూర్ణాహుతి, చక్రతీర్ధ స్నానం, సాయంత్రం 6గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 27న ఉదయం 10గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
chitra...
కల్యాణోత్సవం నిర్వహించనున్న బాల ఆలయం