కృష్ణ

షిర్డీకి బయలుదేరి..! పొగాకు తోటలో దంపతుల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, ఫిబ్రవరి 17: మండలంలోని నెక్కలం గొల్లగూడెం గ్రామ సమీపంలోని పొగాకు తోటలో కల్లూరు బాలప్రసాద్(63), లక్ష్మీప్రసన్న (55)దంపతుల మృతదేహాలను శనివారం గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దంపతులు శుక్రవారం రాత్రి షిరిడీయాత్రకు వెళ్తున్నామంటూ ఇంటి నుండి బయలుదేరారు. శనివారం ఉదయం తోటల్లోకి వెళుతున్న రైతులకు రెండు మృతదేహాలు కనిపించడంతో విషయాన్ని పోలీసులకు తెలుపగా ఎస్‌ఐ లక్ష్మణ్ హనుమాన్ జంక్షన్ సీఐకు సమాచారం అందించారు. హనుమాన్ జంక్షన్ సీఐ నాయుడు ఎస్‌ఐ లక్ష్మణ్ తమ సిబ్బందితో వచ్చి మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపారు.