సాహితి

తెలుగు జాతికి నిండు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్ల సాహిత్యానికి విశేష సేవలందించిన తెలుగు తేజం డా. గూటాల కృష్ణమూర్తి. 1890 నుంచి 1900 సంవత్సరం వరకు ఆంగ్ల సాహిత్యానికి స్వర్ణయుగమని నిరూపించిన మహోన్నత సాహితీమూర్తి ఆయన. వారి ఆంగ్ల సాహిత్య సేవను చూస్తే సి.పి.బ్రౌను తెలుగు సాహిత్యానికి చేసిన సేవతో సరితూచవచ్చు. బ్రౌనుకు తెలుగు జాతి పడిన రుణాన్ని కృష్ణమూర్తిగారు ఈ రీతిగ తీర్చాడనిపిస్తున్నది. 1975లో విదేశాంధ్ర ప్రచురణలు అనే సంస్థను లండన్‌లో ప్రారంభించి, పురిపండా అప్పలస్వామి గారి ‘పులిపంజా’ కవితా సంపుటిని సర్వాంగసుందరంగా విదేశాల్లో ప్రచురించి, హైదరాబాద్ కళాభవన్‌లో ఆనాటి విద్యా సాంస్కృతిక శాఖామాత్యులైన మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ చేయించడం, ఆ సందర్భంగా గూటాల వారిని నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. పచ్చని మేని ఛాయతో సూటు బూటులో తెల్లదొరలా కనిపించేవారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం 2006 అక్టోబర్ 27-28 తేదీల్లో విజయవాడలో జాతీయ తెలుగు రచయితల మహా సభలను డా. గూటాల కృష్ణమూర్తి గారితో ప్రారంభింపజేయడం జరిగింది. అలాగే 2007 సెప్టెంబరు 21, 22, 23 తేదీల్లో అపూర్వమైన రీతిలో జరిగిన ప్రపంచ తెలుగు రచయిత మహాసభలకు వీరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ రెండు కార్యక్రమాల్లో నా ఆహ్వానాన్ని మన్నించి వారు పాల్గొన్నారు.
విశ్వవిఖ్యాత గాయని, నటీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిపై అపురూప గ్రంథం ‘సూర్యకుమారి ఇల్విన్ - ఎ మెమోరియల్ వాల్యూమ్’ను 2003 నవంబర్ 13వ తేదీన సుప్రసిద్ధ సినీ నటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆ సభకు అధ్యక్షత వహించే అవకాశం డా. గూటాల కృష్ణమూర్తిగారు నాకు కల్పించారు. తెలుగు ప్రచురణ రంగ చరిత్రలో అరుదైన, అపురూపమైన గ్రంథాన్ని వారు రూపొందించారు. కృష్ణమూర్తిగారితో చిరకాల పరిచయం ఉండటం వలన లండన్‌లో వారి ఇంటికి వెళ్లాను. మొదటి అంతస్తులో వారి నివాసం. ఇల్లంతా పుస్తకాలమయంగా కనిపించింది. చివరికి బాత్‌రూముల్లో కూడా పుస్తకాల దొంతరలే. అవి మామూలు పుస్తకాలు కావు. ఎక్కడా దొరకని అపురూప గ్రంథాలు. ప్రత్యేకించి 1890 దశకంలో వెలువడిన గ్రంథాలు వీరివద్ద మాత్రమే ఆ దేశంలో లభ్యమవుతాయి. ఆంగ్ల సాహిత్య పరిశోధకులు వాటి కోసం వారింటికి వచ్చి వెళుతుంటారు. సుప్రసిద్ధులకు సంబంధించిన లేఖలను, వస్తువులను భద్రపరచడం వారికి అలవాటు. సర్ ఆర్ధర్ కాటన్ స్వదస్తూరితో వ్రాసిన లేఖలు వారి వద్ద ఉన్నాయి. సరోజినీ నాయుడు వంటి ప్రముఖుల లేఖలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ లైబ్రరీలో ఎప్పుడో వందేళ్ల క్రితం తయారుచేసిన తెలుగు - ఉర్దూ నిఘంటువుకు సంబంధించిన మైక్రోఫిల్మ్ కృష్ణమూర్తిగారు నాకు ఇచ్చారు. అలాగే కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో (1948) చిత్రించిన రేఖా చిత్రాలు ఆనాటి నిర్మాణపు పనులకు దర్పణం పట్టేలాగా వారివద్ద ఉన్నాయి. ఇలాంటి అపురూపమైన సేకరణ వారివద్ద ఎంతో ఉంది. ’1890 ఱజ్యఘూఔ్దజష్ఘ జషఆజ్యశ్ఘూక’ రూఫకల్పనలో ఆయన మునిగి తేలారు. అయితే ఆయన ఎవరి సహాయం లేకుండా అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించకుండా తనకు తానే డిక్షనరీని రూపొందించేందుకు కృషి చేశారు. ఇది ఎంత శ్రమతో కూడిన విషయమో వేరుగా చెప్పపనిలేదు. దాన్ని పూర్తిచేయాలన్న పట్టుదలే ఆయనను ముందుకు నడిపించింది. విదేశాంధ్ర ప్రచురణల ద్వారా మహాకవి శ్రీశ్రీ చేతివ్రాతతో ప్రచురించిన మహాప్రస్థానం గూటాల వారి తెలుగు సాహిత్య సేవకు మహోన్నత దర్పణంగా నిలుస్తుంది. డా. గూటాల కృష్ణమూర్తి గాంధేయవాది. ఆయన మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబర్ 2వ తేదీన, నిర్యాణ దినం జనవరి 30న ఉ. 10 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఒక గంట విరామం, రాట్నం వడికే పనిని టాలీస్టాకీ స్క్వేర్‌లో గాంధీ విగ్రహం వద్ద రోజంతా కొనసాగిస్తారు. విదేశాల్లో గాంధీ తత్త్వాన్ని ప్రచారం చేసిన నిస్వార్థ సేవాతత్పరుడు గూటాల కృష్ణమూర్తిగారు. అదికాక ప్రతిరోజూ రెండు గంటలు తప్పనిసరిగా రాట్నం వడికే అలవాటుంది. ఈ అలవాటును నాలుగు దశాబ్దాల పాటు కొనసాగించారు. స్వదేశంలో చరఖా సంగతి మరిచిపోయినా, విదేశంలో ఉంటున్న కృష్ణమూర్తిగారు మాత్రం దీన్ని ఒక ‘యోగం’గా శ్రద్ధాసక్తులతో ఆచరించారు.
గూటాల గురనాథస్వామి, సుభద్రమ్మ దంపతులకు కృష్ణమూర్తిగారు 1928వ సంవత్సరంలో పర్లాకిమిడి గ్రామంలో జన్మించారు. ప్రస్తుతమిది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. తండ్రి మేజిస్ట్రేట్ గా పనిచేశారు. వీరి విద్యాభ్యాసం విజయనగరంలోను, విశాఖపట్టణంలోను సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1955లో ఎం.ఏ. ఇంగ్లీషు ఆనర్స్ పట్టా పుచ్చుకున్నారు. 1955-1958 మధ్య అమలాపురంలోను, 1958-62 మధ్య బిలాన్ పూర్‌లోను ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు. నిరంతర చైతన్య వాహిని అయిన కృష్ణమూర్తిగారికి ఈ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. పరిధులు లేని ఆయన ప్రజ్ఞకు ఆకాశమే హద్దయింది. 1962లో రీసెర్చ్ కోసం ఇంగ్లాడ్ వెళ్లారు. 1966 లో మధ్యప్రదేశ్ లోని సాగర్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. పొందారు. 1968లో అమెరికా వెళ్లి 1972వరకు బ్రిడ్జ్ వాటర్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రావిడెన్స్ కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇది బోస్టన్ సమీపంలో ఉంది. 1972లో ఇంగ్లాండ్ తిరిగి వచ్చి, లండన్ గ్రామర్ స్కూలులో విదేశీ విద్యార్థులకు ఇంగ్లీషు బోధించారు.
విదేశాలలో నిరంతర విద్యావ్యాసంగంలో తలమునకలవుతూకూడా తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి కృష్ణమూర్తిగారు అహరహం శ్రమించారు. పది సంవత్సరాల పాటు లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. మా నాన్నగారు విద్యాసాంస్కృతి శాఖామంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాంస్కృతిక రంగాల్లో ప్రవాసాంద్రులకు చేయూతనివ్వడానికి స్థాపించి అంతర్జాతీయ తెలుగు సంస్థతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న తెలుగువారి సంతానానికి తెలుగు భాషా సంస్కృతులను పరిచయం చేసి వారికి సాంస్కృతికి వారసత్వం పట్ల అవగాహన ఆసక్తి కలిగించడానికి విశేషంగా కృషి చేశారు.
కృష్ణమూర్తిగారి అభిప్రాయం ప్రకారం 1890-1900 దశాబ్దాల సాహిత్యానికి స్వర్ణయుగంగా ఆ దశాబ్దం ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి కృష్ణమూర్తిగారు ‘1890’ఒ డ్యషజఆక’’ అనే సాహిత్య సంస్థను స్థాపించి నిర్వహించారు. దాని పక్షాన పది జీవిత చరిత్రలు ప్రచురించారు.
‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవమ్ము’’
- అన్న రాయప్రోలు సందేశాన్ని ఆచరణాత్మకం చేసిన మహనీయ వ్యక్తి డా. గూటాల కృష్ణమూర్తి. ఆంగ్లసాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరింపచేసుకొన్న తెలుగు తల్లి ముద్దుబిడ్డడు డా॥ గూటాల కృష్ణమూర్తి . వారి మృతి తెలుగు జాతికి తీరని లోటు. వారి పవిత్రాత్మకు నా నివాళి.

- మండలి బుద్ధప్రసాద్ ఉప సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ