సాహితి

కథా వ్యూహం (శ్రీవిరించీయం 13)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు రచయితలు పూర్తిగా ఉత్తరాలతోనే కథనంతటినీ నింపివేస్తారు. కొందరయితే కేవలం సంభాషణలతోనే అంతా నడుపుతారు. అలాగే కథంతా వర్ణనలతోనే నింపేసే రచయితలు కూడా వున్నారు. ఏ పద్ధతి అవలంబించినా ముఖ్యంగా గమనించవలసిన విషయం యేమిటంటే కథ నడవాలి. పాత్రలను కాగితం మీద చదువరిని మన్ఫఃలకం మీద ముందుకు లాక్కుపోవాలి. అలా ఉత్కంఠ భరితంగా కథ నడిచినప్పుడు యే పద్ధతిలో రాసేం అనేది గుర్తురాదు. కొందరు కవులు కథనంతటినీ పద్యాలతోనో గీతాలతోనో రాసేసి, దానికి ‘ఖండకావ్యం’ అనో ‘కావ్య గీతిక’ అనే నామకరణం చేస్తారు. సంభాషణలతోనే కథంతా నడిపినంత మాత్రంచేత ఆ రచన నాటిక అయిపోదు. కథ అంతటిలోను ఏకత, అనుకూలత, పఠనశీలత ఉండాలి.
రూపం ఎలాంటిది ఎన్నుకున్నా నిర్మాణంలో సమతుల్యత, సమరసత ఉండడం అవసరం. కథావస్తువు ప్రయోగాత్మకత సాధారణంగా రుూ రకాలుగా విభజన చేసుకోవచ్చు- దైనందిన జీవనాన్ని ప్రతిబింబించడం; ఆచార వ్యవహారాల యదార్థ ప్రదర్శనం; వాటి పట్ల ఆప్యాయత, మక్కువ చూపడం లేదా సహేతుకమయిన పరిహాసం చూపడం; మాండలిక పదజాలాన్ని సమయోచితంగా ఉపయోగించడం; ఇంకా లోతులకు వెళ్లి గ్రామ్య పలుకుబడులను ప్రయోగించడం; నైతికతకు విలువ యివ్వడం, విలువలలో జానపద లాలిత్యం చూపడం; సహజత, క్లుప్తత, నిజాయితీ కొరబడకుండా వుండడం; కథా వ్యూహం సరళంగా వుండడం శ్రేయోదాయకం. ఎక్కువ మలుపులు, విరుపులు, తిరుగుబాట్లు చూపించి కథను పద్మవ్యూహంలాగ చేయడం చదువరికి అభిలషణీయం అనిపించక పోవచ్చును.
తెలివయిన రచయిత, చదువరులను ఆకట్టుకోవటానికి- తనతో కట్టి పడవేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అతను ఎంత మందిని తన చుట్టూ పోగుచేసుకోగలిగితే అంత కృతకృత్యుడు అయినాడు అనుకోవచ్చును. ప్రణయ కథ వ్రాస్తూ వున్నప్పుడు, కథ చివరలో ప్రేయసీప్రియులు అన్ని అడ్డంకులు అధిగమించి పెళ్లిచేసుకుని హాయిగా సంసారం గడుపుతూన్నట్లు చూపడం సమంజసంగా కనిపిస్తుంది. అలాకాకుండా వాళ్ల ప్రణయం మధ్యలోనే ఆగిపోయి, యిద్దరూ వేరువేరు వ్యక్తుల్ని వివాహం చేసుకుందుకు అవసరం అయిన సన్నివేశాలు కల్పించి - ఎవరికివారు సుఖంగా సంతోషంగా వున్నారని నమ్మించటానికి ఎంతో శ్రమపడని రచయిత. పాత్రల భౌతికత, మానసికతల మీద విస్తృతమయిన మార్పులు తీసుకురావాలి.
అలాగే డిటెక్టవ్ కథలు వ్రాసేటప్పుడు, నిజంగా నేరం చేసినవాడు దొరికేంతవరకు అంతవరకు అనుమానితుడుగా చూపుతున్న మనిషిని రక్షించటానికి, తగిన సందర్భాలు సన్నివేశాలు కల్పన చేయటానికి ఎంతో శ్రమ అవసరం అవుతుంది.
కథలో మరింత ముఖ్యమయిన విషయం యేమిటంటే- కథకు కథనానికి అంతర్లీనంగా వాతావరణాన్ని కల్పించడం. ఉదాహరణకు కథ పూర్తి నిడివి పది పేజీలు అనుకుంటే అందులో వాతావరణ కల్పనకు, యేర్పాటుకు కనీసం ఆరు పేజీలయినా అవసరం. ఈ ఆరు పేజీలు ఒకచోట కాకుండా కథ పొడుగునా అక్కడక్కడ- కథా గమనానికి అడ్డువస్తున్నట్లు కనిపించకుండా పరుచుకుపోవాలి. వాతావరణ కల్పన సరీగా లేకపోతే చదువరికి కథనం, కథ తీరును గురించే సంశయాలు, సందేహాలు మొలకెత్తుతాయి. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే గాని కథ పరిపూర్ణం కాదు. సమగ్రమైన కథ నిర్మాణం చేయాలంటే రచయిత ఎంతో పరిశోధన చేసి విషయాలను సమాయత్తం చేసుకోవాలి. కాస్త ఆలోచించడం తెలిసినవాళ్లకు, యిదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని స్పష్టంగా తెలుస్తుంది. వ్యూహంలోంచి బయట పడడం యెంత కష్టమో, సిసలయిన కథను తయారుచేయడం కూడా అంతే కష్టం.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584