క్రీడాభూమి

తమిళనాడు వరద బాధితులకు సైనా విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఎడతెరిపిలేని భారీ వర్షాలతో తల్లడిల్లుతున్న తమిళనాడులో వరద బాధితులను ఆదుకునేందుకు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2 లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వనుంది. ఆమె తండ్రి హర్‌వీర్ సింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కుండపోత వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సైనా నెహ్వాల్ 2 లక్షల రూపాయల విరాళం ఇవ్వదలుచుకుందని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది.