ఆంధ్రప్రదేశ్‌

ట్రూ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, జనవరి 16: కడప విమానాశ్రయంలో గురువారం ట్రూ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కడప నుండి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డుతగలడంతో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు. విమానంలో దాదాపు 110 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇందులో వైస్సార్‌సీపీ రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఈ విమానం విజయవాడకు వెళ్లి వచ్చి తిరిగి చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సంఘటనతో రెండు సర్వీసులనూ అధికారులు రద్దుచేశారు. కానీ విజయవాడకు వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం మరో ప్రత్యామ్నాయాన్ని అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.