రాష్ట్రీయం

అమిత్ షా సభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ 15వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ వాయిదా పడింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపించడం, ఇద్దరు వ్యక్తులకు అపుడే పాజిటివ్ రిపోర్టులు రావడంతో భారీ సభలు నిర్వహించడాన్ని సమీక్షించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన మేరకు అమిత్ షా బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కే కృష్ణసాగరరావు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో బహిరంగ సభలు, భారీ జనసమూహాలను తగ్గించాలని భావించినందున ఎల్‌బీ స్టేడియంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్టు ఆయన చెప్పారు. త్వరలోనే తదుపరి తేదీని పార్టీ తెలియజేస్తుందని ఆయన తెలిపారు.