రాష్ట్రీయం

వైభవోపేతంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ: తెలంగాణ మాగాణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భక్తజన రంజకమై, భూకైలాసమై వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10.50 గంటలకు కల్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు. పార్వతీదేవి నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టుకొని ఆలయ అధికారులు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి పార్వతీదేవి పెళ్లికూతురయ్యింది. కల్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్ళంతా కళ్లుచేసుకొని ఎదురుచూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. శివపార్వతుల శూలాలు, భక్తుల జయజయధ్వనుల మధ్య అభిజిత్‌లగ్నంలో శ్రీ పార్వతీదేవిని శ్రీ రాజరాజేశ్వరస్వామి వైభవోపేతంగా పరిణయమాడాడు. ఒకవైపు స్వామివారి దివ్యకల్యాణ తంతు ఇలా జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకొని శూలాలు ఊపుతూ శివుడిని వివాహం చేసుకున్నారు. ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివపార్వతులు కూడా తమ శిరస్సుపై అక్షింతలను చల్లుకున్నారు. 50 వేలకు పైగా భక్తులు, శివపార్వతులు దివ్యకల్యాణాన్ని తిలకించారు. అప్పాల భీమన్న ఇందిరా దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈవో కృష్ణవేణి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ రామతీర్థపుమాధవిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధురాజేందర్ పాల్గొన్నారు.

*చిత్రం...వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైభవోపేతంగా జరిగిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం