రాష్ట్రీయం

తిరుమలేశుని ఆలయం ఎదుట భక్తుల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 1: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆ సమయంలో తమకు శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కలగపోయినా బాధపడలేదు. ఎందుకంటే తిరుమ ల క్షేత్రానికి చేరుకున్న తమకు స్వామి అనుగ్రహం ఉందని భావించి సరిగ్గా 12 గంటల సమయానికి ఆలయం ఎదుట గుమిగూడి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆనందంతో కేకలు వేశారు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా కొందరు చిందులు వేస్తే, మరికొందరు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ, కరచాలనం చేస్తూ శుభాకాంక్షలను తెలియజేశారు. స్వామివారి ఆలయం ఎదుట నూతన సంవత్సర సంబరాలను జరుపుకున్న తరువాత అందరూ అక్కడ నుంచి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేసి, అఖిలాండం వద్ద కర్పూర నీరజనాలు, నారికేళం సమర్పించుకుని ఆనంద పరవశులయ్యారు.
'చిత్రం... తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట మంగళవారం అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న భక్తులు