రాష్ట్రీయం
24 గంటల్లో కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 January 2020
విశాఖపట్నం, జనవరి 4: తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా సముద్రతీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం శనివారం రాత్రి పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. తేమతో కూడిన తూర్పుగాలులు వీస్తున్నందున వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్రం వివరించింది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని కేంద్రం తెలిపింది.