రాష్ట్రీయం

స్పెషల్ ట్రెయిన్ ఆపేసి అయ్యప్పస్వాముల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 4: హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రం కొల్లాంకు వెళ్తున్న శబరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అయ్యప్పస్వామి భక్తులు ఆపేసి ధర్నా నిర్వహించిన సంఘటన రేణిగుంట రైల్వేస్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ... హైదరాబాద్ నుంచి కొల్లంకు అయ్యప్పస్వామి భక్తులు ప్రయాణిస్తున్న శబరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం మధ్యాహ్నం రేణిగుంట రైల్వేస్టేషన్ 4వ నెంబర్ ఫ్లాట్‌ఫాంకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో రైలు బయలుదేరుతున్న సమయంలో అదే రైల్లో ప్రయాణిస్తున్న అయ్యప్పస్వామి భక్తులు ఒక్కసారిగా బోగీల్లో నీటి సమస్య తీర్చాలని స్టేషన్ మాస్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో అక్కడే ఉన్న రైల్వే ఉన్నతాధికారులు కలుగజేసుకుని వచ్చే స్టేషన్‌లో రైల్లో నీటి సమస్య తీరుస్తామని రైల్వే ఉన్నతాధికారులు అయ్యప్ప భక్తులకు నచ్చజెప్పి యథాతథంగా రైలు బయల్దేరింది.