జాతీయ వార్తలు

బీహార్ టాపర్స్ స్కామ్‌లో బోర్డు మాజీ ఛైర్మన్, భార్య అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బీహార్ ఇంటర్ టాపర్స్ స్కామ్‌లో స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు మాజీ ఛైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్, ఆయన భార్య, జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాను ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. 12 తరగతి ఆర్ట్స్, సైన్స్‌ ఫలితాల్లో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఓ టీవీ ఛానల్ ఇంటర్వూ చేయగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో వీరి ర్యాంకులపై అనుమానం వ్యక్తం కావడంతో ఈ కుంభకోణం వెలుగుచూసింది. నలుగురు టాపర్స్‌తో పాటు పరీక్షల్లో అవకతవలకు పాల్పడిన ఓ కాలేజ్ డైరెక్టర్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.