రాష్ట్రీయం

పంటకాలువలో స్కూలు బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రైవర్ మృతి విద్యార్థులు క్షేమం
ఒంగోలు, నవంబర్ 30: ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఉన్న సాయిగార్డెన్ ఫంక్షన్‌హాలు వద్ద ఒక స్కూలు బస్సు- లారీ ఢీకొని పక్కనే ఉన్న కాలువలో బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు డోలా మల్లయ్య (56) తీవ్రంగా, మరో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌ను చికిత్సకోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒంగోలు నగరంలోని క్లౌపేట వద్ద ఉన్న సెయింట్ మెరిస్ హైస్కూలుకు చెందిన బస్సు సోమవారం సమీప గ్రామాలనుండి సుమారు 40మంది విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా సాయిగార్డెన్ ఫంక్షన్ హాలువద్ద జాతీయరహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో బస్సు సమీపంలోని కాలువలోకి ఒరిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ముందుసీట్లలో కూర్చున్నవిద్యార్థులు, బస్సు కుదుపులకు మరికొంతమందికి స్వల్పగాయాలయ్యాయి.