ఖమ్మం

స్కూల్ బస్సు తగిలి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దుఃఖసాగరంలో కుటుంబ సభ్యులు
దుమ్ముగూడెం, డిసెంబర్ 8: మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలో స్కూల్ బస్సు తగిలి సంకనపల్లి గగన దీపిక(3) అనే చిన్నారి మంగళవారం మృతి చెందింది. చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామంలో శ్రీ వీరభద్ర కేరళ మోడల్‌స్కూల్‌కు చెందిన బస్సు(నెం.ఏపీ07 టీటీ 3875) మంగళవారం ఉదయం చిన్ననల్లబల్లి నుంచి స్కూల్ పిల్లలను ఎక్కించుకుంటూ పెద్దనల్లబల్లి గ్రామం చేరుకుంది. అక్కడ రెండెండ్ల యాదవరెడ్డి మనవళ్లు ఇద్దరు స్కూల్ బస్సు ఎక్కారు. మరో మనువరాలు గగన దీపిక బస్సు వద్దకు వచ్చి వారికి టాటా చెప్పే క్రమంలో బస్సు డ్రైవర్ రవి గమనించకుండా ముందుకు నడిపాడు. దీంతో బస్సు ఎక్కే పుట్‌పాత్ తగిలి చిన్నారి కిందపడిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు, బంధువులు వచ్చి గగత దీపికను 108 ద్వారా భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతి చెందిన గగన దీపిక మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దుఃఖసాగరంలో మునిగారు. ఆడుతూ, పాడుతూ అల్లారుముద్దుగా పెరిగిన గగన దీపిక మృతిచెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారి తల్లిదండ్రులు మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో ఉంటున్నారు. గగన దీపిక తన తాత గ్రామమైన నల్లబల్లి వచ్చి ఉంటుంది. తాతయ్య ఆలనాపాలనా చూస్తున్నారు. సంఘటన తెలుసుకున్న ఎస్సై కె.ప్రసాద్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ రవి పరారీలో ఉన్నాడు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.