జాతీయ వార్తలు

మోదీ మంత్రం పనిచేయలేదు: శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మ్యాజిక్ ఏమీ పనిచేయలేదని శివసేన పార్టీ వ్యాఖ్యానించింది. ఎన్నికల ఫలితాలపై శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో కొన్ని ఆసక్తికరమైన విమర్శలు చోటుచేసుకున్నాయి. అస్సాంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడం వల్లే బిజెపి విజయం సాధించిందని, బిహార్ ఎన్నికల తర్వాత ఈ విజయం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చిందని శివసేన పేర్కొంది. ఇక, బెంగాల్‌లో మమతాబెనర్జీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అత్యుత్సాహం కొద్దీ వ్యక్తిగత విమర్శలు చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదని శివసేన పేర్కొంది. ఏది ఎలా ఉన్నా తాజా ఎన్నికలతో బిజెపి బలపడిందని మాత్రం ‘సామ్నా’లో రాశారు.