తెలంగాణ

పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్సీలపై తక్షణం అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అనైతికంగా తన పార్టీలో చేర్చుకోవడం తప్ప సిఎం కెసిఆర్ చేసిందేమీ లేదన్నారు. ఆర్టీసీని మూసేస్తామని బెదిరిస్తున్న ముఖ్యమంత్రి ఇపుడు బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలను భారీగా పెంచేందుకు యోచిస్తున్నారని ఆరోపించారు. ఈ చార్జీలు మితిమీరిన పక్షంలో తాము ప్రజల తరఫున పోరాడతామని షబ్బీర్ హెచ్చరించారు.