జాతీయ వార్తలు
సిద్ధూ దంపతులకు క్లీన్ చిట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 6 December 2018
పంజాబ్: అమృతసర్ రైలు ప్రమాదంలో మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజ్యోత్ కౌర్లకు క్లీన్ చిట్ లభించింది. ప్రమాదం జరిగిన సమయంలో కౌర్ అక్కడ లేరని ప్రభుత్వం స్పష్టంచేసింది. దసరా వేడుకల సందర్భంగా రావణ దహన కార్యక్రమం అక్టోబర్ 19న జరిగింది. రైలు పట్టాలపై నిలబడి ఈ కార్యక్రమం జరుగుతుండగా రైలు దూసుకువచ్చి 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ప్రమాదం జరుగబోయే ముందు కొన్ని నిమిషాలకు కౌర్ అక్కడ నుంచి వచ్చేశారు. అయినప్పటికీ ఆమె అక్కడ వుండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రమాదంపై ప్రభుత్వం జుడీషియల్ విచారణకు ఆదేశించింది.