జాతీయ వార్తలు

ఒడిశాలో నలుగురు సిమి ఉగ్రవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో రౌర్కెలాలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడిచేసి నలుగురు సిమి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు మూడు గంటలసేపు కాల్పులు జరిగాయి. గత ఏడాది నల్గొండ జిల్లా కోదాడలో కాల్పుల సంఘటనతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు రౌర్కెలాలో తలదాచుకున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఒడిశా వెళ్లి నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసారు. వీరి నుంచి బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కోదాడ వద్ద పోలీసుల ఎదురుకాల్పుల్లో ఎజాద్, ఆస్లాం హతం కాగా, మిగిలిన నలుగురు నిందితులు ఫైజల్, మెహబూబ్, అంజాద్, జకీర్‌లు ఇపుడు పోలీసులకు చిక్కారు.