శిప్ర వాక్యం

ఓటు బ్యాంకు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాలాండ్ చీఫ్ సెక్రెటరీ తేమ్‌జెడ్‌తోయ్ (2-8-2018) మాట్లాడుతూ డ్రాఫ్ట్ నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ వెలువడిన వెంటనే సరిహద్దులలో తమ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఎట్టి ఆధారాలు (ఆధార్‌లు) లేకుండా సంచరిస్తున్న కొందరిని బంగ్లాదేశ్‌కు పంపివేసినట్లు చెప్పారు.
ఇలాంటి ప్రక్రియ రాజస్థాన్‌లో జరిగితే పాకిస్తాన్ చొరబాటుదారులు వెలుగులోకి వస్తారు అని విశే్లషకులు అభిప్రాయపడ్డారు.
ఇక్కడ చొరబాటుదారులు, కాందిశీకులు అనే రెండు వర్గాల మధ్య స్పష్టమైన తేడాను గుర్తింపవలసి ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి తరిమివేయబడిన హిందువులు కొందరు పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, అస్సాంలల్లో జీవిస్తున్నారు. వీళ్లను మమతాబెనర్జీ తన ఇంట్లో ఆతిధ్యం ఇచ్చి రక్షణ కల్పిస్తుందా?? బెంగుళూరు (కర్నాటక) పరిసర ప్రాంతాలల్లో 40వేల మంది బంగ్లాదేశీయ చొరబాటుదారులు ఉన్నట్లు లోగడ ఆ రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి అధికారికంగా ప్రకటించారు. మరి వారినెందుకు బంగ్లాదేశ్ పంపలేదు?? అంటే విదేశీ చొరబాటుదార్ల ఓట్లమీద ఇక్కడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలుసు.
ఎన్‌ఆర్‌సి త్వరలో జాతీయ సమస్య కాబోతున్నదా? రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సర్వేకు సిద్ధమైనాయి. హైదరాబాద్‌లోని పాత బస్తీలో వీసాలు లేకుండా ఉన్న వారి సంఖ్య ఎంత? బెంగాల్‌లో రెండు కోట్ల మంది అని ప్రాథమిక అనధికార అంచనా- వీరంతా బంగ్లాదేశ్ వెళ్లిపోతే మమతాబెనర్జీ ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే ఆమె అక్రమ చొరబాటుదార్లను సమర్థిస్తున్నది. ఇలాంటి వ్యక్తులు భారతదేశ ప్రధాని పదవి కోరుకోవటం దేశభద్రతకు హానికరం కాదా? మమతాబెనర్జీ ఒక మానసిక రోగి. ఆమె కాంగ్రెసు సంస్కృతిని జీర్ణించుకున్నది. హత్యా రాజకీయాల్లో అందె వేసింది. ప్రస్తుత భారతదేశ ప్రధాని కావాలనుకొంటూ అందుకు దేశంలోని 25కోట్ల ముస్లిములతోబాటు బెంగాల్‌లోని 3 కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు తనకు సహాయం చేస్తారని ఆశిస్తున్నది. దేశభక్తులను హతమార్చండి (జో హంసే టకరాయెంగే- మిట్టీమే మిల్ జాయెంగే- చూర్‌చూర్ కరేంగే) అన్నది. ఈమె ఓటు బ్యాంకు రాజకీయ షాహీ ఇమాం, బుఖారీ బర్హతీ వంటి ఓటు బ్రోకర్లు అండగా ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య హిందూస్థాన్ ఎందుకు ఉండాలి? దీనిని ఇస్లామిక్ ఫండమెంటల్ రిపబ్లిక్‌గా మార్చండి’ అని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. చైనా, పాకిస్తాన్‌లు విద్రోహులకు ప్రత్యక్ష మద్దతు ఆర్థిక సహాయం ప్రకటించాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారు. ఎఎఫ్‌ఐ, ఐసిస్ కార్యకర్తలున్నారు. వీరి కాంపులు అసదుద్దీన్ (ఒవైసీ) మద్దతుతో నడుస్తున్నాయి.
మొన్న బెంగాల్‌లో ఇమాం అబ్దుల్ బర్కతీ ఇలా అన్నాడు. ‘నేను మమతాబెనర్జీకి ముస్లిం ఓట్లు గంపగుత్తగా (హోల్‌సేల్) సప్లై చేస్తాను. అందుకు నాకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరాను. ఒకవేళ అమిత్‌షా (బిజెపి అధ్యక్షుడు) నాకు 5 కోట్లు ఇస్తే 25 లక్షల ముస్లిం ఓట్లు ఆయన పార్టీకి బట్వాడా చేయిస్తాను. బెంగాల్‌లో 2.5 నుండి 3 కోట్ల వరకు బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లుఉన్నాయి. వీటి మీద మమతాబెనర్జీ (లోగడ జ్యోతిబసు) ప్రభుత్వాలు ఆధారపడ్డాయి. నౌగాంగ్ ముషీరాబాదువంటి జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలు (హైదరాబాదు పాతబస్తీ వంటివి.) ఈ ఓట్లకోసం షాహీ ఇమాం వంటివారి దయకోసం రాజకీయ పార్టీలు ప్రాధేయపడుతుంటాయి.
2014 ఏప్రిల్ మొదటివారంలో శ్రీమతి సోనియాగాంధీ న్యూఢిల్లీ ఇమాం బుఖారీని కలిసింది. మీరు (ముస్లిములు) మేము (క్రైస్తవులు) మానవతా దృక్పథంతో రోహింగ్యాలకు బంగ్లాదేశీ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వాలి అని ఏచూరి సీతారాం పి.ఎల్.విశే్వశ్వరరావులు వాదిస్తున్నారు. భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలున్నారు. అదనంగా ఈ 3 కోట్ల మంది చొరబాటుదారులు వస్తే వీరికి భూమి భుక్తి సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు? చైనా వీరికోసం తన దేశంలో కొంత భూభాగం ఇస్తుందా?? 2050 నాటికి ఇండియాలో ‘హిందూ’జాతి మైనారిటీలో పడిపోతుందని ఇది ముస్లిం మెజారిటీ దేశంగా మారిపోతుందని గణాంకాలు సూచిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?? ఆర్యసమాజం, విశ్వహిందూ పరిషత్ వంటి సామాజిక సంస్థలు స్వామిశ్రద్ధానందను ఆదర్శంగా తీసుకొని ‘హిందూ’ శుద్ధి కార్యక్రమం నిర్వహించాలి. గత నూరేండ్లలో రెండు కోట్లమంది క్రైస్తవులుగా మారిపోయారు. టిటిడిలో పెద్దసంఖ్యలో క్రైస్తవులు, కమ్యూనిస్టులు ఉద్యోగులుగా ఉన్నారు. వీరినందరినీ హిందూ మతంలోకి తీసుకొని రావాలి. ఈ పని దేశంలోని పీఠాధిపతులు చేయాలి. అలాకాక కేవలం మోక్షపురుషార్థ ప్రవచనాలు వ్యర్థం. కాంగ్రెస్ పార్టీ గాంధీ-నెహ్రూ ఇందిరాగాంధీల నాయకత్వంలో కేవలం ముస్లిముల కోసమే పార్టీని నడిపింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు బాప్టిజం చేయబడ్డ క్రైస్తవులు. అంటే కాంగ్రెసుపార్టీ హిందువులను రక్షించరు. కమ్యూనిస్టులు టిఎంసి వంటి పార్టీలు బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలల్లో హిందూ జాతిని నిర్మూలిస్తున్నారు. శంషాబాదు సమీపంలో చిన జియ్యరుస్వామి వందల అడుగుల ఎత్తు రామానుజస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నారు. సంతోషం. మరి ఒక్క క్రైస్తవుడినైనా శ్రీవైష్ణవుడిగా మార్చగలిగారా? లేదు. ఎందుకని?? ఈ విగ్రహాలు ఎవరికోసం??

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్